DNB News - తెలంగాణ / : తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే . ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే వేదికపై నుండి అర్జీదారులకు న్యాయం చేయాలన్న ఎమ్మెల్యే ఉద్దేశం . తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యను విన్న ఎమ్మెల్యే . చిన్న చిన్న సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతా.... స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపుతాను అని తెలియజేశారు. మరికొన్ని సమస్యలను న్యాయ న్యాయాలను పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపండి అని అధికారులు ఆదేశించిన ఎమ్మెల్యే నాని. పార్టీలకు అతీతంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో అర్జీదారులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News