DNB News - తెలంగాణ / : మునగాల:-విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని సీతానగరం గ్రామ ఉపసర్పంచ్ వరికుప్పల ఎల్లయ్య సూచించారు. మంగళవారం సీతానగరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు , పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్, పాఠశాల క్లాస్ టీచర్ వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతి కార్యదర్శి నవిత మూడో వార్డు మెంబర్ పుల్లూరు ఉపేందర్ , సీనియర్ జర్నలిస్ట్ పడిశాల నాగరాజు , పడిశాల ఉదయ్ విద్యార్థిని ,విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
DNB News