DNB News - తెలంగాణ / : హైదరాబాద్:ఏప్రిల్ 06 అక్కడెక్కడో పశ్చిమ మాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియులపై ధరల ప్రభావం పడనుంది, వారి జేబులకు చిల్లు పడే అవ కాశాలు కనిపిస్తున్నాయి, మద్యం, బీర్ల ధరలు మే నెలలో పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఉత్పత్తి సమస్యలు కలిసి ధరల పెంపుకు దారితీస్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం నేరుగా మద్యం పరిశ్రమపై పడుతోంది. ముఖ్యంగా సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో గాజు సీసాల తయారీ తీవ్రంగా దెబ్బతింది. దీంతో సీసాల కొరత పెరిగి, తయారీ ఖర్చులు బాగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గాజు సీసాల ఉత్పత్తి చాలా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని యూనిట్లు పూర్తిగా మూతపడగా, మరికొన్ని ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు కూడా పెరిగి కంపెనీలపై అదనపు భారం పడుతోంది.ఇక రాష్ట్రంలో మద్యం ధరల సమీక్ష గడువు పూర్తవ్వడం మరో కీలక కారణంగా మారింది. గతసారి 2023 మేలో ధరలు సవరించగా, ప్రస్తుతం కొత్త రివ్యూకు సమయం దాటిపోయింది. దీంతో ధరల పెంపు దిశగా
Admin
DNB News