DNB News - తెలంగాణ / : ప్రస్తుతం గవర్నర్ కోటాలో నియమించాల్సిన ఎమ్మెల్సీ పదవులు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా అజారుద్దీన్, కోదండరాం పేర్లు గవర్నర్ ఆమోదం కోసం ఇంకా నిలిచిపోయాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన గవర్నర్ ఈ ఫైల్స్ను ఆమోదిస్తారా.. లేక మరింత ఆలస్యం చేస్తారా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా అజారుద్దీన్ ఎమ్మెల్సీ నియామకం కీలకంగా మారింది. ఒకవేళ ఈ నియామకానికి కూడా ఆమోదం లభించకపోతే.. ఆయన మంత్రి పదవిపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక కొత్త గవర్నర్ తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
Admin
DNB News