DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని కొక్కిరేణి గ్రామంలో యశోద హాస్పిటల్ మరియు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంపులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే లైన్స్ క్లబ్ చైర్మన్ దోసపాటి గోపాల్ పిలుపు నిచ్చారు,శనివారం కొక్కరేణి గ్రామంలో ములకలపల్లి కుమారి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఎం.కె.ఆర్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ,కార్పొరేట్ యుగంలో వైద్యం పేదలకు మరింత దూరం అయిందని ఇలాంటి వైద్య క్యాంపులను పేద ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు పేద ప్రజలకు చిన్నచిన్న జబ్బులకు కూడా వైద్యం అందటలేదని ప్రభుత్వ వైద్యం బలోపితం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు గ్రామాల్లో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు కొక్కిరేణి లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో కంటి గుండె ఆర్తో స్త్రీల వైద్య నిపుణులు పాల్గొని సుమారు 500 మందికి మెడికల్ చెక్ అప్ నిర్వహించడం అభినందనీయం ఆయన అన్నారు, ఇలాంటి మెడికల్ క్యాంపులకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు ఈ క్యాంపులో గుర్తించిన కంటి పరీక్షలకు సూర్యాపేట లైన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు,ఈకార్యక్రమంలో ఎం.కె.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ మునగాల మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములు,అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో లైన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుడిపూడి వెంకటేశ్వరరావు,సీనియర్ న్యాయవాది టేకులపల్లి శ్రీనివాసరావు,సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు,లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ మేదరమట్ల వెంకటేశ్వరరావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,గ్రామసర్పంచ్ దాసరి శ్రీను,మాజీ సర్పంచ్ వక్కవంతుల ప్రభాకర్ రావు,దిరావత్ రవి,కెవిపి జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, మిట్టగడుపుల ముత్యాలు, పుట్టెపు సైదులు ఎస్కే సైదా, కలకోవ సర్పంచ్ మండవ వెంకటాద్రి, ఎం.కె.ఆర్.ఫౌండేషన్ సెక్రటరీ ములకలపల్లి కార్తీక్,ఇంటూరు హుస్సేన్, మాజీ సర్పంచ్ రావులపెంట వెంకన్న,మాజీ ఉపసర్పంచ్ రావులపెంట బ్రహ్మం,నందిగామ పెదరాములు, ములకలపల్లి ఝాన్సీ లక్ష్మి, ములకలపల్లి నాగరాజు, వసంత్, నవీన్, పుట్టెపు గోపి, విజయ, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News