DNB News - తెలంగాణ / : హోలీ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో గంజాయి మిశ్రమంతో తయారు చేసిన భాంగ్ విక్రయాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బేగంబజార్, ధూల్పేట్ ప్రాంతాల్లో చేపట్టిన ఈ ఆపరేషన్లో మూడు కేసులు నమోదు చేసి, ఆరుగురిని అరెస్ట్ చేశారు. మొత్తం 2.622 కిలోల భాంగ్ స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ‘A’ టీమ్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ధూల్పేట్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించింది. గంజాయి కలిపి భాంగ్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించి NDPS చట్టం కింద కేసులు నమోదు చేశారు. కేసుల వారీగా వివరాలు: కేసు – 1: 860 గ్రాముల భాంగ్ స్వాధీనం. నిందితులు: చింతామణి చందన్ సింగ్ (43), సాహిల్ సింగ్ (20) – బేగంబజార్ ప్రాంతం. కేసు – 2: 812 గ్రాముల భాంగ్ స్వాధీనం. నిందితులు: భగత్ రాజ్ నందన్ యాదవ్ (31) – బేగంబజార్, నాంపల్లి; మహేష్ చంద్ర శర్మ (54) – అఘాపురా, సీతారాంబాగ్. కేసు – 3: 950 గ్రాముల భాంగ్ స్వాధీనం. నిందితులు: సాగర్ శర్మ (41) – ఊంట్వాడి, బేగంబజార్; అజయ్ శర్మ (43) – జుమ్మెరాత్ బజార్. హోలీ వేడుకల సమయంలో మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల కొనుగోలు, వినియోగం చట్ట విరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Admin
DNB News