DNB News - తెలంగాణ / : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం కాళంగి గ్రామం నందు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరిపాక వాసుదేవరావు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు మాట్లాడుతూ, దళితుల కోసం కొట్లాడిన మహనీయుడు, అనగారిన వర్గాలని అభ్యున్నతి లోనికి తీసుకు వచ్చేందుకు పోరాడిన యోధుడు, పార్లమెంటరీగా చిరస్థాయిగా పిలిచిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్. జనం కోసమే తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన ఆయన జయంతి ఈరోజు 1908 ఏప్రిల్ 5వ తారీఖున బీహార్ లోని చంద్వార్ లో జన్మించారు. 1919 ప్రాథమిక విద్య పూర్తి చేసిన బాబు జగ్జీవన్ రామ్ 1920 పాఠశాల విద్య 1926లో ప్రథమ స్థానంలో మెరిట్యులేషన్ పూర్తి చేశారు. 1931లో కలకత్తా యూనివర్సిటీ నుంచి బిఎస్సి పట్టా పొందారు. సామాజిక ఉద్యమాలు చేశారు. స్వతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. 30 ఏళ్ల పాటు కేంద్ర స్థాయిలో ఉన్నతమైన పదవులు పొందారు. 1930 సంవత్సరంలో సత్యాగ్రహ ఉద్యమం చేపట్టారు. 27 ఏళ్ల వయసులో 1935లో బీహార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్ ప్రెవెన్షియల్ లెజిస్లేచర్ పార్టీ తరఫున 15 మంది అభ్యర్థులను పోటీ చేయించి అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను గెలిపించుకున్నారు. సమాజానికి దేశానికి ఇంత సేవ చేసిన మహనీయులకు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని కోరుకుంటున్నాం.. ఈ కార్యక్రమంలో MSF సత్యవేడు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ మల్లారం వెంకట కృష్ణయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మొదటి తరం నాయకులు ఆత్మకూరు మునేందర్ మాదిగ, మూగచింతల మోహన్ బాబు మాదిగ, గూడూరు రమణయ్య మాదిగ, మల్లారం శ్రీనివాసులు మాదిగ, యాసారం బుజ్జయ్య మాదిగ,
Admin
DNB News