Saturday, 18 April 2026 02:14:22 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

బి.ఆర్.ఎస్ పార్టీ అంటేనే బ్లాక్‌మేయిల్ రాష్ట్ర సమితిగా మారిందని చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్, తీవ్రంగా విమర్శించారు.

Date : 03 February 2026 11:50 AM Views : 83

DNB News - తెలంగాణ / : ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కవిత, ప్రత్యక్ష సాక్షిగా నిలిచారని, “నా భర్త ఫోన్, నా ఫోన్ కూడా టాపింగ్ చేశారు” అని ఆమె స్వయంగా చెప్పడం ఈ ఆరోపణలకు బలమైన ఆధారమని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఎవరి దయ వల్ల రాలేదని, సకల జనుల పోరాటంతో, లక్షలాది మంది త్యాగాలతో తెలంగాణ సాధ్యమైందని, *యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ గొప్ప త్యాగం వల్లే రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు *గద్దర్ గారిని 70 ఏళ్ల వయసులో ప్రగతి భవనం ముందు ఏడు గంటలు నిలబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అన్యాయమని, అలాగే తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ గారిని తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినప్పుడు మానవత్వం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.దేశంలో అనేక మంది ప్రముఖ నాయకులు – జయలలిత, మాయావతి, యడ్యూరప్ప, లాలూ ప్రసాద్ యాదవ్, సింబు సోరెన్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విచారణను ఎదుర్కొన్నారని గుర్తు చేస్తూ, కెసిఆర్, నిజాయితీపరులైతే విచారణకు పూర్తిగా సహకరించి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాని అరుపులు, ధర్నాలు, బెదిరింపులతో ప్రజలను మభ్యపెట్టలేరని, నిజం ఉంటే చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రజాస్వామ్యం, చట్టపాలన కచ్చితంగా అమలు అవుతాయని, కాబట్టి బి.ఆర్.ఎస్ నాయకులు సంయమనం పాటించాలని, ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని చంద్రశేఖర్ యాదవ్ హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :