Monday, 15 June 2026 01:43:26 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు

Date : 16 March 2026 09:42 AM Views : 55

DNB News - తెలంగాణ / : హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ నాయకులు. డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్ట మహేష్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మెన్ కె. నారాయణ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నాలుగో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కరచాలనం చేసి, అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో కొద్దిసేపు వారితో కలిసి మ్యాచ్ ఆడి ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ దేశంలో క్రీడల అభివృద్ధి విషయంలో ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. క్రీడలను కార్పొరేట్ లాభాల కోసం కాకుండా యువత అభివృద్ధి కోసం వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ పేరుతో క్రీడాకారులను సంతలో సరుకుల్లా వేలం వేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. యువతలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మైదానాలు, శిక్షణా కేంద్రాలు, క్రీడా సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. యువత మాదకద్రవ్యాలు, బెట్టింగ్ సంస్కృతి వంటి దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలని, క్రీడలు క్రమశిక్షణ, ఐక్యత, పోరాటస్ఫూర్తి పెంపొందించే గొప్ప సాధనమని నారాయణ పేర్కొన్నారు. భగత్ సింగ్ ఆశయాలు యువతకు ప్రేరణ కావాలని, క్రీడలు మరియు విద్య ద్వారా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి మొలుగురం కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకర సమస్యగా మారిందన్నారు. విద్యార్థులు అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యలో ముందుండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత ముందుండాలని, ఈ దిశగా అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మరియు ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :