Saturday, 18 April 2026 02:16:02 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు

Date : 16 March 2026 09:42 AM Views : 37

DNB News - తెలంగాణ / : హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ నాయకులు. డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్ట మహేష్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మెన్ కె. నారాయణ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నాలుగో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కరచాలనం చేసి, అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో కొద్దిసేపు వారితో కలిసి మ్యాచ్ ఆడి ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ దేశంలో క్రీడల అభివృద్ధి విషయంలో ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. క్రీడలను కార్పొరేట్ లాభాల కోసం కాకుండా యువత అభివృద్ధి కోసం వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ పేరుతో క్రీడాకారులను సంతలో సరుకుల్లా వేలం వేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. యువతలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మైదానాలు, శిక్షణా కేంద్రాలు, క్రీడా సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. యువత మాదకద్రవ్యాలు, బెట్టింగ్ సంస్కృతి వంటి దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలని, క్రీడలు క్రమశిక్షణ, ఐక్యత, పోరాటస్ఫూర్తి పెంపొందించే గొప్ప సాధనమని నారాయణ పేర్కొన్నారు. భగత్ సింగ్ ఆశయాలు యువతకు ప్రేరణ కావాలని, క్రీడలు మరియు విద్య ద్వారా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి మొలుగురం కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకర సమస్యగా మారిందన్నారు. విద్యార్థులు అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యలో ముందుండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత ముందుండాలని, ఈ దిశగా అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మరియు ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :