DNB News - తెలంగాణ / వరంగల్ : హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి,ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టినట్లు ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవా రం ఉదయం సోదాలు నిర్వహించారు. వెంకట్ రెడ్డి నివాసంతో పాటు..ఆయన కు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఉదయం నుండి మొత్తం పది చోట్ల సోదాలు జరుగుతున్నట్లు అధికారు లు తెలిపారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, హన్మకొండలోని ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. భారీగా నగదు, బంగారం, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పదవిని అడ్డం పెట్టుకొని వందల కోట్ల విలువైన ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఉండటంతో మొదటి ఏసిబి అధికారులు ప్రాథమిక విచారణ జరిపి... అనంతరం అధికారి కలెక్టర్ ఆదాయానికి మించిన ఆస్తు లు సంపాదించినట్లుగా గుర్తించి కేసు నమోదు చేసుకుని ఈ సోదాలు కొనసాగిస్తున్నారు.
Admin
DNB News