DNB News - తెలంగాణ / : ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై Telangana High Court కీలక నిర్ణయం తీసుకుంది. ఒక మహిళ రాసిన లేఖను ప్రజాహిత వ్యాజ్యం (పిల్)గా స్వీకరించి విచారణ చేపట్టింది. వెంకటాపురం గ్రామానికి చెందిన వితంతువు తిప్పల సాయిభవాని హైకోర్టుకు లేఖ రాస్తూ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇండ్లు కేటాయించాలంటే ప్రజల నుంచి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ముడుపులు వసూలు చేస్తున్నారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా వసూలు చేసిన డబ్బుతో అధికారులు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని కూడా ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ లేఖను పిల్గా స్వీకరించిన హైకోర్టు, ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి, ములుగు జిల్లా కలెక్టర్తో పాటు Central Bureau of Investigation కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును జస్టిస్ పి. శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగ్రావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.
Admin
DNB News