DNB News - తెలంగాణ / : స్వాతంత్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేడు నగరంలోని సుభాష్ నగర్ లో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం హాజరై కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ , సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి , గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తో పాటు పలువురు నేతలతో కలిసి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులు, అఖిలభారత కాంగ్రెస్ కు రెండుసార్లు అధ్యక్షులుగా వ్యవహరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్రం సిద్ధిస్తుంది అని నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థను స్థాపించి ఆంగ్లేయులు అనేకసార్లు జైల్లో నిర్బంధానికి గురిచేసి ఇబ్బందులు పెట్టినా నమ్మిన సిద్ధాంతం కోసం ఈ దేశ ప్రజల కోసం అహర్నిశలు పోరాడిన గొప్ప వ్యక్తి నేడు వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను నేటి యువత పునికి పుచ్చుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారి ఆశ సాధన కోసం కృషి చేస్తుందని జిల్లా కాంగ్రెస్ పక్షాన ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ,సుడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,గ్రంధాలయ చైర్మన్ సత్తు మల్లేశం, బానోతు శ్రావణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, గంట కళ్యాణి శ్రీనివాస్, కుర్ర పోచయ్య, అమీర్, చర్ల పద్మ, మహమ్మద్ అజీమ్, మూల రవీందర్ రెడ్డి, దండి రవీందర్, వంగల విద్యాసాగర్, ముస్తాన్, తంగేళ్ల కిరణ్, ఈశ్వరి, వసీం, శిల్ప, మాదాసు శ్రీనివాస్, సత్తినేని శ్రీకాంత్, తోట అంజయ్య, సిరికొండ శివప్రసాద్, యనమల మంజుల, షబానా మహమ్మద్ హనీష్, బత్తుల రాజు కుమార్, ఇమ్రాన్, రోళ్ళ సతీష్, ముల్కల కవితయోన, ఫజల్, గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News