DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలో వెలుగుమట్ల పార్కు ప్రాంతాల్లో గత 15 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ప్రజలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ పేదల ఇండ్లు కూలగోడుతున్న ప్రభుత్వ అధికారులను, పోలీసు బలగాలను అడ్డం పెట్టుకొని పేదలు కట్టుకున్న చిన్న గుడిసేల నుండి బయటికి పంపిస్తున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. ప్రజా పాలన అంటే ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడతానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కాపాడుతున్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉన్నదని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ అన్నారు. ఆయన పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులను పేదల పక్షాన నిలబడి పేదప్రజల నిలువ నీడకొరకు గుడిసెలు ఏపిస్తే వాటిని అధికారికంగా పేదలకు పంచిపెట్టాల్సిన ప్రభుత్వం నేడు దౌర్జన్యంగా పేదప్రజల భూములను వారు కట్టుకున్న ఇండ్లను కూల్చడమే కాకుండా అక్కడికి వెళ్లి సంఘీభావం తెలుపుతున్న కమ్యూనిస్టు నాయకులను అరెస్టులు చేయడం సరికాదనీ. వెంటనే వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని పేద ప్రజలు నివసిస్తున్న గుడిసెలను వారికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే పోలీసు బలగాలు, ప్రభుత్వ అధికారులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లి వారికి రక్షణ కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున వారు డిమాండ్ చేశారు.
Admin
DNB News