Thursday, 16 April 2026 05:07:57 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

వివిధ గ్రామాలలో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

Date : 15 April 2026 11:13 AM Views : 41

DNB News - తెలంగాణ / : దేశం గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మండలంలోని వివిధ గ్రామాల వాడవాడల ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మునగాల మండల ఎమ్మార్వో సరిత మునగాల ఎస్సై బి ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ లు పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈ భూమిపై జీవించిన ఓ అద్భుతం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అని, ఆయనతో జీవించిన వారు అదృష్టవంతులు అని అన్నారు. ఇప్పుడు మహనీయుడు మనతో లేకపోయినా ఆయన ఆశయాలు సజీవంగా ఉన్నాయని అన్నారు. ఆ ఆశయాలను కొనసాగించడం మన బాధ్యత అని అన్నారు డాక్టర్ అంబేద్కర్ మొదటి ప్రత్యేకత భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన అపూర్వ సేవ రాజ్యాంగ సభ గ్రాఫిక్ కమిటీ చైర్మన్గా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించి సమానత్వం షేర్ చేయమని మూల సూత్రాలను దేశానికి అందించారు అన్నారు ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి ప్రపంచంలో అతి ప్రగతి శీలమైనదిగా ప్రశంసలు అందుకుంటుందని అన్నారు. మత విద్య పంతుడిగా ఆయన సాధించిన విజయాలు కొలంబియా యూనివర్సిటీ లండన్ ఎకనామిక్స్ లో డాక్టర్ సంపాదించిన ఆయన భారతీయుల్లో అత్యంత విద్యావంతుడుగా నిలిచారని అన్నారు విద్య ద్వారా దళితులు ఎదగాలని ఆయన బోధించారన్నారు హైదరాబాదులోని యూనివర్సిటీలో విద్యార్థులు ఆయన జీవిత చరిత్ర చదివి వేలన పొందుతున్నాను అని అన్నారు ఆయన విద్య ఆదర్శాలు ఇప్పటికీ దేశవ్యాప్తంగా అమరవుతున్నాయని అన్నారు ఇండియాలో ఉంటూ అమెరికాలోని లైబ్రరీలో పుస్తకాలు తెప్పించుకుని చదివిన గొప్ప మేధావి అంబేద్కర్ అని అన్నారు. ఆయన కష్టపడితేనే మన అద్భుత రాజ్యాంగం అని అన్నారు. అంబేద్కర్ భారతదేశానికి అందించిన రాజ్యాంగమే ఇప్పటికి అమలవుతుందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు రిజర్వేషన్లు సమాన అవకాశాలు ఈ రాజ్యాంగ ఉండే సాధ్యమైతున్నాయని అన్నారు. వారు అందించిన గొప్ప అవకాశాన్ని రాజ్యాంగాన్ని గౌరవించి దానిలో పొందుపరిచిన వాటిని గౌరవించమే అంబేద్కర్ కు మనం ఇచ్చే గౌరవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల ఎంపిఓ నరేష్, కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కాసర్ల వెంకట్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, సీపీఎం మండల పార్టీ కార్యదర్శి బుర్రి శ్రీరాములు, మునగాల మండల ఎంఎస్పి అధ్యక్షుడు లంజపల్లి శ్రీను, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య, ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీను, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము ఈదారావు, అంబేద్కర్ యువజన సంఘం జాన్ సుందర్, శ్రీకాంత్, వార్డ్ మెంబర్లు సుధీర్, అమరనాథ్, మేరిగ శ్రీను, బండారు రామకృష్ణ, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :