Wednesday, 17 June 2026 02:16:11 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఖమ్మం వేదికగా త్వరలో ఉమ్మడి ఖమ్మం -సామాజిక న్యాయ సభ

Date : 31 January 2026 12:49 PM Views : 67

DNB News - తెలంగాణ / : - డాక్టర్ అవ్వారు వేణు కుమార్ -బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం స్టేట్ కో-ఆర్డినేటర్ - 42% రిజర్వేషన్లకై ప్రధాన పార్టీలు కదలాలి - ప్రొఫెసర్ వీరస్వామి - హిస్సా ( వాటా )ఇజ్జత్ ( ఆత్మగౌరవం ) హుకుమత్ ( అధికారం) నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం -కర్నాటి మనోహర్ నేత ఖమ్మం ఖమ్మం జిల్లా వేదికగా తర్వలోన "ఉమ్మడి ఖమ్మం జిల్లా -సామాజిక న్యాయ సభను" నిర్వహించబోతున్నట్లు ముఖ్య అతిధులుగా హాజరైన బిసిఐఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్స్ ,డాక్టర్ అవ్వారు వేణు కుమార్, ప్రొఫెసర్ వీరస్వామి, కర్నాటి మనోహర్ నేత తెలిపారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలో బిసి ఇంటలెక్చువల్ ఫోరం - ఉమ్మడి ఖమ్మం' జిల్లా ఆధ్వర్యంలో... బిసిఐఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ పద్మ నేతృత్వంలో ఖమ్మం రెడ్ క్రాస్ సొసైటీ వేదిక గా సన్నాహక సమావేశాన్ని గా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అవ్వారు వేణు కుమార్ , ప్రొఫెసర్ వీరస్వామి, కర్నాటి మనోహర్ నేత లు మాట్లాడుతూ ... బీసీలకు 42% అమలు కావాలంటే దానికి ఏకైక మార్గం కేవలం 9వ షెడ్యూల్‌ ద్వారా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీసీలకు సామాజిక న్యాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్పష్టమైన హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేస్తామని ప్రకటించిందని, కానీ ఈ హామీ నీటి మూట అని తేలిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి,42% రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్పించాలని అన్నారు. రానున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో బీసీలకు తమకు దక్కాల్సిన వాటా 42 శాతాన్ని అమలు చేసేంతవరకు ఎన్నికలకు వెళ్ళవద్దని సూచించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్, ప్రేక్షక పాత్ర వహించడం మానేసి, ఈ అంశాన్ని తక్షణమే టేకప్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం జనగణలో కుల గణన చేస్తామనీ హామీ ఇచ్చి మరో సారి మోసానికి సిద్ధమైనదని విమర్శించారు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగే హౌస్ హోల్డ్ షెడ్యూల్ కాన్వాసింగ్ లొ 33 కాలమ్స్ ఉండగా అందులో కాలం నెంబర్ 12 లో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు బీసీ లను వదిలి వేస్తున్నారు ఇది జనగణనలో కులగనను నీరుగార్చడమేనని వారు విమర్శించారు బీజేపీ – బీఆర్‌ఎస్ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు బీసీల పట్ల బాధ్యతగా నిలబడి, 42% రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి,బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కర్నాటి మనోహర్ నేత మాట్లాడుతూ మేమెంతో మాకు అంత మా నినాదం ,అలాగే హిస్సా,ఇజ్జత్, హుకుమత్ మా ఉద్యమ నినాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు పిండిపూలు రామ్మూర్తి, పద్మశాలి సంఘం పొలిటికల్ ఫోరం కన్వీనర్ గుంటి నగేష్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీపతి, మున్నూరు కాపు సంఘం మూల గుండ్ల శ్రీహరి, శాలివాన సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీపతి, బీసీ విద్యార్థి యువజన అధ్యక్షులు రమణ, వినయ్,అనిల్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: