DNB News - తెలంగాణ / : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడులో టీబి ముక్త్ భారత అభ్యాన్ 100 రోజులు కార్యక్రమంలో గుర్రాలపాడు కౌన్సిలర్ బుర్ర మహేష్ పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని, అలాగే గ్రామంలో క్షయ వ్యాధి కేసులు లేకుండా టీబి రహిత గ్రామంగా చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా క్షయ నివారణ కార్యాలయం సహకారంతో ఉచిత డిజిటల్ ఎక్స్ రే మిషన్ ద్వారా క్షయ అనుమానిత ఛాతి ఎక్స్ రే నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, వారి తెమడ నమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో తెల్లారుపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మరియు ఖమ్మం క్షయ నివారణ సిబ్బంది పాల్గొన్నారు
Admin
DNB News