DNB News - తెలంగాణ / : సీసీఎస్ ప్రత్యేక క్రైమ్ టీమ్ మరియు అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 72 గ్రాముల ఎండీఎం డ్రగ్తో పాటు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు జోగ్ సింగ్, చునారాం చౌదరి, అమృత్ పురోహిత్లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా రాజస్థాన్కు చెందినవారే కాగా ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితులు బషీర్బాగ్లోని బీజేఆర్ విగ్రహం వద్ద ఎండీఎం డ్రగ్ను గ్రాముకు 6 వేల నుంచి 8 వేల రూపాయల వరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రత్యేక బృందం వారిని పట్టుకుంది. సింథటిక్ మాదక ద్రవ్యం అయిన ఎండీఎం వినియోగం, విక్రయం, కొనుగోలు మరియు రవాణా పూర్తిగా చట్టవిరుద్ధమని పోలీసులు తెలిపారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని.. ఎవరైనా మాదక ద్రవ్యాలతో పట్టుబడితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్ను డీసీపీ చైతన్య కుమార్ మార్గదర్శకత్వంలో, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ బిక్షపతి మరియు వారి సిబ్బంది అబిడ్స్ పోలీసులతో కలిసి విజయవంతంగా నిర్వహించారు.
Admin
DNB News