Saturday, 18 April 2026 02:14:23 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్

Date : 14 March 2026 10:23 AM Views : 32

DNB News - తెలంగాణ / : హైదరాబాద్ నగరంలో పలు రాష్ట్రాల్లో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్కొండ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం, హబీబ్ నగర్ పోలీసులతో కలిసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని భారీగా బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రధాన నిందితుడు సలీం ఖురేషీ అలియాస్ హమీద్ ఖురేషీ అలియాస్ మున్నా ఖురేషీ, వయసు 53 సంవత్సరాలు. ప్రస్తుతం టోలిచౌకీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. మరో నిందితుడు మొహమ్మద్ ఘౌస్ పాషా, వయసు 33 సంవత్సరాలు, తల్లగడ్డ ప్రాంతానికి చెందిన డ్రైవర్. ఈ కేసులో మరో నిందితుడు సబీర్ ముంబైకి చెందినవాడు. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి 220 గ్రాముల బంగారు నగలు, 3100 గ్రాముల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల మొత్తం విలువ సుమారు రూ.33 లక్షల 71 వేల 475గా అధికారులు అంచనా వేశారు. నిందితులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ఇళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు 8 కేసుల్లో తమ ప్రమేయాన్ని నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటిలో కాకినాడ , నెల్లూరు, తిరుపతి, ముంబైలోని ములుండ్, నావఘర్ ప్రాంతాలు, అలాగే మధ్యప్రదేశ్‌లోని భోపాల్ మిస్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు ఉన్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం… ప్రధాన నిందితుడు సలీం ఖురేషీ ముంబైలో పెరిగాడు. చిన్న వయసులోనే కుటుంబ పరిస్థితుల కారణంగా నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతడు, అక్కడి గ్యాంగ్‌లతో సంబంధాలు పెంచుకుని నేరాలకు పాల్పడినట్లు తెలిపాడు. అనంతరం 2001లో హైదరాబాద్‌కు వచ్చి కొంతకాలం సాధారణ జీవితం గడిపినా, ఆర్థిక సమస్యల కారణంగా మళ్లీ దొంగతనాల వైపు మళ్లినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. నిందితులు ముందుగా కారులో తిరుగుతూ పగటి సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించేవారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఆ ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి నగలను దొంగిలించేవారు. దొంగిలించిన నగలను కరిగించి బిస్కెట్లుగా తయారు చేసి, నాసిక్ మరియు హైదరాబాద్ నగరాల్లోని కొన్ని బంగారు దుకాణాలకు విక్రయించినట్లు వారు అంగీకరించారు. మార్చి 12వ తేదీ రాత్రి మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు వారిని ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌లో బంగారం, వెండి బిస్కెట్లు, స్క్రూడ్రైవర్, హ్యామర్, రెండు మొబైల్ ఫోన్లు లభించాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపినప్పుడు ఈ మొత్తం నేర చరిత్ర వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్‌ను గోల్కొండ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్. వెంకటేష్, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం రావు, ఎస్‌ఐ విజయానంద్ మరియు వారి సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న ఆభరణాలతో పాటు కేసును హబీబ్ నగర్ పోలీసులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగర టాస్క్ ఫోర్స్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆండే శ్రీనివాసరావు ఈ వివరాలను వెల్లడించారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :