DNB News - తెలంగాణ / : ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ ( GGH ) లో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ SPS మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శి కుర్రి సైదయ్య చిన్న బోస్క నరేష్ ఆదేశాల మేరకు....... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం మరియు కమిటీ ఎన్నిక చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా SPS కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి ఉబ్బ రమ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న 17,800 మంది కార్మికులు థర్డ్ పార్టీ ( బెడ్ సైడ్ కాంటాక్ట్ )విధానం ద్వారా నష్టపోతున్నారు అని ప్రభుత్వమే తక్షణమే కార్మికుల అందరి వేతనాలు స్వయంగా కార్మికుల ఎకౌంటులో వెయ్యాలి అని ఉద్యోగ భద్రత అవకాశం కల్పించాలని మాతంగి అనిల్ కుమార్ మాట్లాడినారు. ట్రేడ్ యూనియన్లకు అతీతంగా SPS అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగినది అని తెలియపరచినారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు తధాంత్రం నూతన టెండర్ ప్రక్రియ కొనసాగించాలి అని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అని అట్టి నిర్ణయం విరమింపజేసి కార్మికులందరికీ IFMIS ద్వారా వేతనాలు ఇవ్వాలి అని కోరిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఈదునూరి అనిల్ కుమార్ గత ఎన్నో సంవత్సరముగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ ట్రేడ్ యూనియన్లు కూడా ఏజెన్సీలో రాకముందు ఒక రీతిగా ఏజెన్సీలు వచ్చిన తర్వాత ఒక రీతిగా వ్యవహరిస్తున్నాయి అని తెలియపరచారు. కానీ నేను ప్రత్యక్షంగా చూసిన అసోసియేషన్ లలో SPS కార్మికుల పక్షాన ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేస్తుంది అని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న D. లక్ష్మి, k పవన్, S భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, గంగ , మనమ్మ , సరిత , రమ్య , ప్రియా, మల్లికాంబ, ప్రసన్న, B లక్ష్మి , అరుణ, ప్రియాంక, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News