DNB News - తెలంగాణ / : ఆదరిస్తే మున్సిపాలిటీకి అభివృద్ధి చేస్తానని అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల బరిలో బి ఆర్ఎస్, టిడిపి బలపరిచిన 16 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సత్యవరపు ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే మా వార్డులో సీసీ రోడ్లు గాని, డ్రైనేజీ శుభ్రం చేయడం వీధిలో ఎల్ఈడి లైట్లు ఎప్పుడు వెలిగేలాగా చూడడం మా వార్డులో ఎలాంటి సమస్య ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని.ప్రజలను విన్నవించుకున్నారు బి ఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిగా అభివృద్ధికి బాటలు వేస్తానని అన్నారు ప్రజల సమస్యలు తీర్చేందుకు మునిసిపాలిటీలు నా వంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు. ఎన్నికల గుర్తు కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సత్యవరపు సంపూర్ణ, నారం రాజశేఖర్ తదితరులు పార్టీ కార్యకర్తలతో అశ్వారావుపేట లోని ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని,కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లును అభ్యర్థించారు.
Admin
DNB News