Saturday, 18 April 2026 06:07:06 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

నేడే "బహుజన గళం" అతిథులుగా హాజరుకానున్న కూనంనేని, మేయర్

Date : 09 April 2026 06:35 PM Views : 21

DNB News - తెలంగాణ / : అణ గారిన వర్గాలకు ఆద్యులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు బడుగు, బలహీన వర్గాలు ఐకమత్యంతో ముందుకు సాగాలని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ వారసుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు వానపాకుల రాంబాబు అన్నారు. మున్సిపల్ పరిధి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో బహుజన నాయకులతో కలిసి, గురువారం పాత్రికేయులతో మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొమరం భీమ్ ప్రాంగణంలో శుక్రవారం ధూమ్ దాం కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాష లు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ వాదం ఉట్టిపడేలా తెలంగాణ కళాకారులు పాటమ్మ రాంబాబు, చుక్క రాంనర్సయ్య, పమ్మి రవి లచే సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. నేడే బహుజన గళం ఐక్యవేదిక ఆధ్వర్యంలో బహుజనుల ఆద్యులు అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడుతూ.. ధూమ్ ధామ్ కార్యక్రమం ఉంటుందని వానపాకుల పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేటర్లను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మెమొంటో లు అందజేస్తామన్నారు. బహుజనులు, కళాకారులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద మొత్తంలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐక్యవేదిక పట్టణ అధ్యక్షులు శివాటి మల్లేష్, ఉపాధ్యక్షులు గంగాధర సురేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లూరి సాంబశివరావు, భరత్ చంద్ర, ఇరుగు రాజు, మెంతిన సమ్మయ్య, మహిళా నాయకురాళ్లు పూనెం సీత, నక్క లావణ్య, అనపర్తి పుష్ప, కొమరం సరస్వతి లు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :