Friday, 19 June 2026 01:57:25 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

యాదాద్రి భువనగిరి జిల్లాలో లంచం తీసుకున్న సీనియర్ అకౌంటెంట్

Date : 13 March 2026 09:34 AM Views : 57

DNB News - తెలంగాణ / : యాదాద్రి భువనగిరి జిల్లాలో లంచం తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ వలలో చిక్కాడు. మోత్కూర్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ మహ్మద్ ఖదీర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడి 38 రోజుల జీత బిల్లును ప్రాసెస్ చేయడానికి మొదటగా రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తరువాత రూ.5 వేలకే ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ తెలిపింది. అధికార సూచనల మేరకు ఫిర్యాదుదారు ఫిబ్రవరి 5న తన ఫోన్‌పే నుంచి అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో సీనియర్ అకౌంటెంట్ నిరంజన్ ఫోన్‌పే నంబర్‌కు రూ.5 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తరువాత ఫిబ్రవరి 27న ఆదాయపు పన్ను కట్ చేయకుండా జీత బిల్లును ప్రాసెస్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతూ మరోసారి రూ.5 వేల లంచం డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. ఫిర్యాదుదారు మరోసారి రూ.5 వేలును అధికారికి ఫోన్‌పే ద్వారా పంపిన తర్వాతే బిల్లును ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేసి టోకెన్ జారీ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఇదే విధంగా మరో వ్యక్తి నుంచి కూడా రూ.5 వేల లంచం తీసుకున్నట్లు విచారణలో బయటపడింది. విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లాభం పొందినందుకు సీనియర్ అకౌంటెంట్ మహ్మద్ ఖదీర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు. కేసుపై విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: