DNB News - తెలంగాణ / : నేడు మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ అధ్యక్షతన.. ఆరోగ్య లక్ష్మి నూతన కమిటీని ఏర్పాటు. చేయడం జరిగింది . ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. బాలింతలు గర్భిణీలు ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రభుత్వం అందించే బలవర్ధక ఆహారం మరియు పౌష్టికాహారాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని... .. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని .. అంగన్వాడి సెంటర్లకు. కావలసిన ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయడమే కాకుండా. .. గర్భిణీలకు బాలింతలకు. మంచి పౌష్టికాహారాన్ని అందిస్తుందని అలాగే చిన్న పిల్లలకు గుడ్లు బాలామృతం తదితర ఆహారాన్ని అందిస్తూ. పిల్లలకు చిన్నతనం నుంచే. మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు కృషి చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. .. అలాగే గ్రామంలో ఉన్న. ప్రైమరీ హై స్కూల్.ను. బలోపేతం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు దుస్తులను. రెండు జతల బూట్లను ఉచితంగా అందించడంతోపాటు అల్పాహారం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తుందని కావున నర్సరీ నుంచి ఐదవ తరగతి వరకు విద్యార్థులను ఇతర ప్రైవేటు పాఠశాలకు. పంపి వేల రూపాయల ఫీజులను కట్టి ఆర్థికంగా నష్టపోకుండా ఇలా ప్రభుత్వ పాఠశాలలకు పంపి ఉన్నతమైన. విద్యను. అందించేందుకు కృషి చేయాలని.... అలాగే. గ్రామస్తులు అనారోగ్య సమస్యలు వస్తే ప్రైవేటు హాస్పటల్ కి వెళ్లకుండా ప్రభుత్వ హాస్పిటల్ కు. వెళ్లి ఉచిత వైద్యం మరియు అవసరమైన మందులను పొందాలని నేడు ప్రైవేటు కార్పోరేట్ హాస్పిటల్ కి దీటుగా. ప్రభుత్వ హాస్పిటల్లో మంచి సదుపాయాలు ఉన్నాయని. నాడు నేను రాను బిడ్డ. సర్కారు దవాఖానకు. అన్నారు నేడు మేము పోము బిడ్డ ప్రైవేట్ దవాఖానకు అనే పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరు ప్రైవేటు వైపు వెళ్లకుండా ప్రభుత్వం ఉచితంగా అందించే నాణ్యమైన విద్య వైద్యమును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటాచారి పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు అంగన్వాడి కార్యకర్త ఉమా. ఏఎన్ఎం రమణ ఆశా కార్యకర్త అంగన్వాడి ఆయా. గ్రామానికి చెందిన బాలింతలు గర్భిణీలు మహిళలు పాల్గొన్నారు
Admin
DNB News