DNB News - తెలంగాణ / : ఈ రోజు మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖ చిత్రకారుడు అగాచార్య ను అభినందించారు. అగాచార్య తాను క్యాన్వాస్ పై చిత్రించిన తైలవర్ణ చిత్రాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన చిన్నతనం నుండి అగాచార్య పెయింటింగ్స్ చూస్తున్నానని, అందరిని ఆకట్టుకునే విధంగా పల్లె వాతావరణాన్ని అద్భుతంగా తన కుంచె ద్వారా చిత్రీకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అగాచార్య వెంట ఆయన కుమారుడు వాసు, డా. పొన్నం రవిచంద్ర పాల్గొన్నారు.
Admin
DNB News