DNB News - తెలంగాణ / : కరీంనగర్ టౌన్, ముకరంపూర్ సర్కస్ గ్రౌండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన 'ధి లావిస్' రెస్టారెంట్ రెండో బ్రాంచ్ను కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు , మాజీ కార్పొరేటర్ ఎడ్ల అశోక్, 64వ డివిజన్ కార్పొరేటర్ శ్రీజ-అజయ్ తదితరులు పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ఇలాంటి మరిన్ని సంస్థలు రావడం అభినందనీయమన్నారు. యాజమాన్యం రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో భోజన ప్రియుల కోసం ప్రత్యేకంగా 5 రకాల బిర్యానీలతో పాటు విభిన్న రకాల వంటకాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నాణ్యతతో పాటు రుచికి ప్రాధాన్యతనిస్తూ నగర ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తామని అన్నారు.
Admin
DNB News