DNB News - తెలంగాణ / : నడిగూడెం:మండల పరిధిలోనిశుభకార్యానికి వెళ్లివస్తూ అదుపు తప్పి కారు పల్టీ కొట్టిన ఘటన గురువారం సాయంత్రం నడిగూడెం, కాగిత రామచంద్రపురం రహదారి లో చోటుచేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై గంధమల్ల అజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన పసుపులేటి యాదగిరి, తాళ్లూరి వెంకటేశ్వర్లు, కస్తూరి వీరభద్రం తో పాటు మరికొందరు మండలంలోని రామాపురం గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోని మూలమలుపులో వారు ప్రయాణిస్తున్న కారు ఒకసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి తాటి చెట్టును ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు యాదగిరి వీరభద్రం గాయాలు కాగా కారులో ఉన్న అదే గ్రామానికి చెందిన పురోహితుడు చక్రధర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు
Admin
DNB News