DNB News - తెలంగాణ / : నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్థానిక తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి మార్కులను సాధించారని కళాశాల చైర్మన్ సిహెచ్. సతీష్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గ్రూపుల వారీగా సాధించిన ఫలితాలు కళాశాల క్రమశిక్షణకు, బోధనా పటిమకు నిదర్శనమని ఆయన కొనియాడారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు ఎం.పి.సి. ఎంపీసీ విభాగం ప్రథమ సంవత్సరం ఏ. కార్తికేయ (467/470), బి. నివేధన్ (467/470), పి. సాయి చరణ్ (466), బి. నితిన్ (466), బి. సాయి తేజ (465), కె. నంద కిషోర్ (465) మార్కులతో సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం ఏ. శ్రీవర్ధన్ (993/1000) మార్కులతో అత్యున్నత ప్రతిభ కనబరచగా, బి. రిషిత్ యాదవ్ (992), ఏ. నందిశ్వర్ రెడ్డి (992), ఎం. వర్షిత్ (992) మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. సి.ఇ.సి. సిఈసి విభాగం ప్రథమ సంవత్సరం వి. శ్రీ చేతన్ (483/500) ఎం. వంశీ నాయక్ (478), సిహెచ్. వరుణ్ తేజ (475) మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం బి. రామ్ చరణ్ (972/1000), వై. నవదీప్ (969), జి. రాజేందర్ (968) మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. బై.పీ.సీ. బైపిసి విభాగం పి. ఆదిత్య నాయక్ (ప్రథమ సంవత్సరం 426/440), ఆర్. జగన్ (ద్వితీయ సంవత్సరం 954/1000) మార్కులు సాధించి కళాశాల పేరు నిలబెట్టారు ఈ సందర్భంగా చైర్మన్ సతీష్ రావు మాట్లాడుతూ అత్యధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేవలం అకడమిక్స్లోనే కాకుండా, రాబోయే జూన్ నెలలో విడుదలయ్యే ఆర్మీ, నేవీ నోటిఫికేషన్లకు అనుగుణంగా విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. డిఫెన్స్ రంగంలో ఉద్యోగాల సాధనే లక్ష్యంగా శిక్షణ ఏర్పాట్లు చేశామని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోచింగ్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు. విజయం సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన అధ్యాపక బృందాన్ని మరియు తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం అభినందించింది.
Admin
DNB News