DNB News - తెలంగాణ / : ఎట్టకేలకు కొత్త బస్టాండ్ అక్రమ కేసు కొట్టివేత... అక్రమ కేసులకు భయపడేది లేదు - సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ ఆనాడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం నూతన బస్టాండ్ అక్రమ కేసును శుక్రవారం అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది... 2021 మే నెలలో కురిసిన కొద్దిపాటి వర్షానికి కొత్త బస్టాండు పైకప్పు కురిసి సీలింగ్ పూర్తిగా పడిపోయింది. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు వై విక్రమ్, జీడిమెట్ల వెంకన్నబాబు, నర్రా రమేష్ కొత్త బస్టాండుకు చేరుకొని సీలింగ్ పడిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. దీంతో ఆనాటి ప్రభుత్వం సిపిఎం నాయకులు వై విక్రమ్, జె వెంకన్న బాబు, రమేష్ లపై అక్రమ నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది. ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నేడు ఖమ్మం జిల్లా న్యాయస్థానం అక్రమ కేసును కొట్టివేసింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఎల్లప్పుడు ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. అక్రమ కేసులకు, నిర్బంధాలకు భయపడేది లేదని ఉద్ఘాటించారు..
Admin
DNB News