DNB News - తెలంగాణ / : మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం నాడు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు వక్కంతుల భరత్ బాబు మాట్లాడుతూ, కోట్లాదిమంది ప్రజల సుదీర్ఘ పోరాటాలు అమరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినదని, ఇది 12వ వార్షికోత్సవం అని తెలిపారు. ఈసందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు మనుగడ కోసం ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులు, యువజనులు, విద్యా కమిటీ , సభ్యులు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేసి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధికి, బావి భారత పౌరుల నిర్మాణానికి ప్రతి ఒక్కరం తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సతీష్ కుమార్ అంగన్వాడీ టీచర్ కళావతి ఉపాధ్యాయులు వి. భరత్ బాబు పాల్గొన్నారు.
Admin
DNB News