DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని కలకోవ గ్రామంలో గ్రామపంచాయతీఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని ఈసందర్భంగా గ్రామసభ నిర్వహించడంజరిగింది, గ్రామ సర్పంచ్ మండవ వెంకటాద్రి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి గ్రామపంచాయతీ పునాది వంటివిఈవ్యవస్థ బలంగా ఉన్నప్పుడే దేశం, రాష్ట్రం,జిల్లా,మండలం గ్రామాలు, సుభిక్షంగా ఉంటాయని, ఆయన అన్నారు, గ్రామపంచాయతీ కార్యదర్శి దొంగరి సైదులు, గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలందరూ బైరు భూమికి బయటకు వెళ్లకుండా, మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు,అదేవిధంగా గ్రామపంచాయతీలో రెండు తీర్మానాలను ప్రవేశ పెట్టడం జరిగింది, శిధిలవ్యవస్థలోఉన్న ఎంపీపీ ఎస్, పాత బిల్డింగు ప్రమాదకరంగా ఉన్నందున పాఠశాల పిల్లల శ్రేయస్సు దృష్టి దానిని డిస్మెంటల్ చేయడానికి గ్రామసభ సంబంధిత మండల అధికారులకు ప్రతిభాగంలో పంపనయినది, పాఠశాలను కూల్చివేయాలని, ఈ వేసవి నీటి ఎద్దడి నివారణకు గాను ఒక బోరును అద్దెకి తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఈతీర్మానాలకు గ్రామ ప్రజలు పాలకవర్గం సంపూర్ణంగా మద్దతి ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండవ వెంకటాద్రి,పంచాయతీ కార్యదర్శి దొంగరి సైదులు, లైన్మెన్ లచ్చిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పాతకోట్ల రమణ, బొడ్డుపల్లి సావిత్రి, సిద్దుల వీరయ్య,తిప్పని నవ్య, చిర్రా వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ చిర్రా శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు, మాజీ వార్డ్ మెంబర్ బొడ్డుపల్లి శ్రీను, ఏఎన్ఎం నాగమణి, ఆశవర్కర్ దొంతగాని నాగమణి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News