DNB News - తెలంగాణ / : స్థానిక ఆదోని ఆర్టీసీ డిపో దగ్గర సమ్మె కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యుఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీమ్ ఖాన్ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు పి ఎస్ గోపాల్ తిప్పన్న సహాయ కార్యదర్శి లక్ష్మన్న డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు వీరేష్ వీరు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక కోడులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గతంలో పోరాటాల ద్వారా సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దుచేసి 10 గంటల వరకు కార్మికులతో పని చేయించాలని లేబర్ కోర్టులో పొందుపరచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి గతంలో ఉన్న కార్మిక చట్టాలను అమలు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీ సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుందని అన్నారు.
Admin
DNB News