DNB News - తెలంగాణ / : మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తుమ్మల తండా గొర్రెలపాడు గ్రామానికి చెందిన బానోత్ సాయి (25) అనే యువకుడు మరిపెడలోని ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సాయి తన మిత్రుడితో కలిసి మరిపెడలోని రాజీవ్ గాంధీ సెంటర్ ప్రాంతంలో ఉన్న ఆగ్రోస్ భవనం పై అంతస్తులో అద్దె గదిలో నివసిస్తున్నాడు. సాయంత్రం అతనితో కలిసి ఉండే మిత్రుడు ఇంటికి వచ్చి తలుపు తట్టినా లోపల నుంచి స్పందన రాలేదు. అనుమానం రావడంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సాయి ఉరివేసుకుని మృతిచెందినట్లు కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. యువకుడు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు
Admin
DNB News