DNB News - తెలంగాణ / : మహిళ సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీ రాజ్ అధికారి డీఈఈ వెంకట శ్రీహర్ష అన్నారు. సోమవారం మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో పది లక్షల రూపాయలతో వ్యయంతో ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా మంజూరైన మహిళా స్త్రీ శక్తి భవన నిర్మాణ పనులకు పంచాయతీ రాజ్ డీఈఈ వెంకట శ్రీహర్ష, సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సంఘాల బలోపేతానికి ఈ భవనాలు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్, మండల పంచాయతీ రాజ్ ఎఈ వంసత,ఎపిఎం కరుణాకర్,సిసిలు సాంబయ్య, లక్ష్మి, ఉప సర్పంచ్ వట్యావుల సైదులు, వార్డు సభ్యులు మళోత్ లక్ష్మి,లాలమ్మ, ,శైలజ,లింగమ్మ, సుమన్, ఉషా, ఒక్కటో సంఘబంధం అధ్యక్షురాలు స్వాతి,రెండో సంఘబంధం అధ్యక్షురాలు కొల పద్మ, మహిళా సంఘాల సభ్యులు జిల్లేపల్లి సైదమ్మ, స్రవంతి,రమణ,విజయ, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్యా నాయక్, వెంకటేశ్వర్లు, లక్ష్మి నారాయణ, సోమపంగు గోపి, ప్రసాద్, పుల్లయ్య,కొల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News