Saturday, 18 April 2026 02:14:23 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

హైదరాబాద్‌లో టీ పొడి కల్తీ రాకెట్‌ను కమిషనర్ టాస్క్ ఫోర్స్ బట్టబయలు చేసింది.

Date : 24 February 2026 05:03 PM Views : 53

DNB News - తెలంగాణ / : నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన కమిషనర్ టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం, సనత్‌నగర్ పోలీసులతో కలిసి సనత్‌నగర్ పరిధిలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో టీ పొడిని సింథటిక్ రసాయనాలతో కల్తీ చేస్తున్న జగన్నాథ్ బిష్ణోయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోకోపీట్‌ను బెల్లం నీటితో కలిపి, సన్‌సెట్ యెల్లో మరియు టార్ట్రజైన్ వంటి సింథటిక్ రంగులు జతచేసి, నాసిరకం టీ డస్ట్ మరియు గ్రాన్యూల్స్‌తో కలిపి కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అసలు టీ పొడిగా చూపిస్తూ స్థానిక టీ దుకాణాలు, డీలర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. దాడుల్లో 120 కిలోల కల్తీ టీ పొడి, 30 కిలోల సహజ టీ పొడి, 138 కిలోల కోకోపీట్ మిశ్రమం, సింథటిక్ రంగులు, తూకం యంత్రం, గ్యాస్ సిలిండర్ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆహార కల్తీ ఆరోగ్యానికి ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తూ, ప్రజలు నాణ్యమైన మరియు విశ్వసనీయ విక్రేతల వద్దనే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని సూచించారు. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దాడులను కమిషనర్ టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం, బంజారా హిల్స్ పోలీసులతో కలిసి విజయవంతంగా నిర్వహించింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :