DNB News - తెలంగాణ / : నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన కమిషనర్ టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం, సనత్నగర్ పోలీసులతో కలిసి సనత్నగర్ పరిధిలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో టీ పొడిని సింథటిక్ రసాయనాలతో కల్తీ చేస్తున్న జగన్నాథ్ బిష్ణోయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోకోపీట్ను బెల్లం నీటితో కలిపి, సన్సెట్ యెల్లో మరియు టార్ట్రజైన్ వంటి సింథటిక్ రంగులు జతచేసి, నాసిరకం టీ డస్ట్ మరియు గ్రాన్యూల్స్తో కలిపి కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అసలు టీ పొడిగా చూపిస్తూ స్థానిక టీ దుకాణాలు, డీలర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. దాడుల్లో 120 కిలోల కల్తీ టీ పొడి, 30 కిలోల సహజ టీ పొడి, 138 కిలోల కోకోపీట్ మిశ్రమం, సింథటిక్ రంగులు, తూకం యంత్రం, గ్యాస్ సిలిండర్ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆహార కల్తీ ఆరోగ్యానికి ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తూ, ప్రజలు నాణ్యమైన మరియు విశ్వసనీయ విక్రేతల వద్దనే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని సూచించారు. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దాడులను కమిషనర్ టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం, బంజారా హిల్స్ పోలీసులతో కలిసి విజయవంతంగా నిర్వహించింది.
Admin
DNB News