DNB News - తెలంగాణ / : మునగాల: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆయన చూపిన మార్గంలో యువత నడవాలని పడిశాల నాగరాజు అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాజ్యాంగంలో ప్రతి పేదవాడికి సరైన న్యాయం జరిగే విధంగా రూపొందించారని ఆయన రూపొందించిన రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరూ సంక్షేమ ఫలాలు పొందుతున్నారన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని మంచి మార్గంలో నడవాలన్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని విగ్రహ ఏర్పాటు కాకుండా ఆయన చూపిన మార్గంలో నడిచి భవిష్యత్తును నిలుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లూరీ ముత్యాలు సార్, పుల్లూరి ఉపేందర్, శివాజీ, పరిశరములు, ఉదయ్, వినయ్ ,వెంకన్న, శివ, పాల్గొన్నారు.
Admin
DNB News