DNB News - తెలంగాణ / : మునగాల:ఆర్టీసీడ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఘటనపై తీవ్రఆగ్రహం వ్యక్తంచేస్తూ బహుజన స్టూడెంటు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కత్తి వీరన్న, మాట్లాడుతూ,శంకర్ గౌడ్ మృతి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తక్షణన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూప్రజాసేవలో నిమగ్నమైన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. శంకర్ గౌడ్ మృతి వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయాలని, కుటుంబ సభ్యులకు ఆర్థికసహాయం అందించాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది అని అన్నారు
Admin
DNB News