Monday, 15 June 2026 01:58:43 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్

Date : 16 March 2026 02:20 PM Views : 56

DNB News - తెలంగాణ / : హైదరాబాద్: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… మార్చి 15 రాత్రి దాదాపు 8 గంటల 30 నిమిషాల సమయంలో చిలకానగర్ గ్రౌండ్ వద్ద సుధీర్ కుమార్ అనే వ్యక్తిని అతని స్నేహితులు సంతోష్, తరుణ్ కత్తితో దాడి చేసి హత్య చేశారు. ముందుగా సుధీర్ కుమార్ మరియు నిందితుడు సంతోష్ మధ్య పాత వివాదాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సంతోష్ తన స్నేహితుడు తరుణ్‌తో కలిసి సుధీర్ కుమార్‌ను చిలకానగర్ గ్రౌండ్‌కు పిలిచాడు. అక్కడ జరిగిన వాగ్వాదం తలెత్తడంతో సంతోష్ కత్తితో సుధీర్‌పై దాడి చేశాడు. సుధీర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా ఇద్దరు నిందితులు వెంటపడి పలుమార్లు కత్తితో పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆరు గంటల్లోనే నిందితులు బనోతు సంతోష్, పొడిశెట్టి తరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు సెల్ ఫోన్లు, ఒక ఆక్టివా బైక్‌తో పాటు నిందితుల దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ కె. సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉప్పల్ పోలీసులు ఈ కేసును త్వరగా ఛేదించినట్లు అధికారులు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :