DNB News - తెలంగాణ / : హనుమకొండ జిల్లా: వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఆత్మకూర్ సిఐ సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం గూడెప్పాడు సెంటర్లో “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ పలు సూచనలు చేశారు మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవింగ్, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జాతీయ రహదారి163 పై పత్తిపాక క్రాస్, దర్గా, గ్యాస్ సెంటర్ ప్రాంతాల్లో మూడు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశామన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని సిఐ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News