DNB News - తెలంగాణ / : స్పోర్ట్స్ కాంప్లెక్స్ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మం పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సిటీ అర్ముడ్ పోలీస్ హెడ్ క్వాటర్స్ ఆవరణలోని ఇటీవల ప్రారంభమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అత్యాధునిక హంగులతో నూతనంగా నిర్మితమైన షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ ను బుధవారం పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...పోలీస్ కుటుంబాల కోసం ఆధునిక సౌకర్యాలు, శిక్షణ, కోచింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మానసిక ఉల్లాసంతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. అదేవిదంగా శారీరక దారుఢ్యం కోసం షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును పోలీసు సిబ్బందికి అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఇటువంటి సౌకర్యాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామాని అన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందిస్తూ ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు (ఏఆర్) కుమారస్వామి, విజయబాబు, ఏఆర్ ఏసిపి లు సుశీల్ సింగ్, నర్సయ్య, ఎస్బి ఏసిపి మహేష్, సిసిఎస్ ఏసీపీ సర్వర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కామరాజు, శ్రీశైలం,సాంబశివరావు సురేష్, నాగుల్ మీరా, ఇన్స్పెక్టర్లు రాజిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News