Monday, 15 June 2026 01:48:08 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పదవ తరగతి పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

Date : 06 April 2026 10:52 AM Views : 44

DNB News - తెలంగాణ / : విద్యార్దులు కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకు ఇచ్చే అతి పెద్ద బహుమతి విద్యార్దులకు నాణ్యమైన, పౌష్టికాహారం మెనూ ప్రకారం అందించాలి ఖమ్మం అర్బన్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల పై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆదివారం ఖమ్మం అర్బన్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలను తిరుగుతూ, మౌళిక సదుపాయాలు, వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిల్వ విధానాలు, స్టోర్ రూమ్‌లో ఉన్న బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర సరుకుల సామగ్రిని తనిఖీ చేసి, రికార్డు రిజిష్టర్ల ను పరిశీలించారు. కామన్ మెనూ ప్రకారం ఆదివారం విద్యార్థులకు అందించుటకు వండుతున్న ఆహారాన్ని బగారా రైస్, మటన్ కూరను పరిశీలించారు. పరిసరాలలో నీటి నిల్వలు ఉండకుండా ఇంకుడుగుంతను ఏర్పాటు చేయాలని, గ్రౌండ్ స్ధలంను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో నేరుగా ముచ్చటించి పాఠశాలలో కల్పిస్తున్న వసతుల గురించి, మెస్ కమిటీ వివరాలు అడిగి తెలుసుకుని, కమిటీ సమావేశాలు నియమితంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని , మెనూకు అనుగుణంగా నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పదవ తరగతి గది సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇప్పటి వరకు వ్రాసిన పరీక్షల వివరాలను అడిగి వారి చదువు, లక్ష్యాలు, ఆశయాల గురించి తెలుసుకుని, చదువును ఇష్టంతో చదివి భవిష్యత్ లో ఉన్నత స్థాయికి చేరుకొని మీ తల్లిదండ్రులకు, మన జిల్లాకు మంచి పేరు తేవాలని, మరో రెండు ఎగ్జామ్స్ ఏలాంటి భయం, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్దం కావాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువు పై దృష్టి పెట్టి పరీక్షలకు హాజరు కావాలని, ఉన్న మరో రెండు పరీక్షలకు ఉన్న సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మనం చదువు పై నమ్మకంగా ఉంటూ పరీక్షలకు హాజరైతే మంచి ఫలితాలు వస్తాయని, ఈసారి పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహిస్తున్నారని, పరీక్షల మధ్య ఎక్కువ రోజుల సమయం రావడం వలన విద్యార్థులకు మంచి వెసులుబాటు కల్గిందని అన్నారు. విద్యార్దుల కెరీర్‌లో పదవతరగతి, ఇంటర్ ముఖ్యమైన దశలని, ఏకాగ్రతతో సిద్దమైతే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, గొప్ప స్థాయికి చేరుకోవాలని, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఒక్కో మెట్టు ఎక్కుతూ, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలని, కొన్ని సందర్భాలలో విఫలం అయిన మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ అనుకున్న రంగాలలో మంచి స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ అన్నారు. మనం ఎంత సమయం చదువుతున్నాం అనే దానికంటే, ఎంత శ్రద్ధగా చదువుతున్నా మనేది చాలా ముఖ్యమని తెలిపారు. ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటూ పరీక్షలకు బాగా సన్నద్ధం కావాలని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రోజు మంచి నిద్ర ఉండాలని, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో బయట ఆహారం తీసుకోవద్దని, బయట ఎక్కువ తిరగవద్దని, మంచినీరు తగినంత త్రాగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి , జిల్లా జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ రూబీ, ఖమ్మం అర్బన్ మండల ఎంఈఓ శైలజ లక్ష్మీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :