DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని తాడ్వాయి గ్రామానికి చెందిన తంగేళ్ల నరేష్ శ్రావణిదంపతులు వారి కుమారుడు తంగెళ్ల ప్రజ్వల్ పుట్టినరోజు సందర్భంగా ముకుందాపురం గ్రామసమీపంలో ఉన్న,ఇందిరాఅనాధ వృద్ధాశ్రమంలో వారి కుటుంబసభ్యులతో కలిసి పండ్లు పాలు, చాక్లెట్స్, అందజేయడం జరిగింది,ఈకార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ,మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కుటుంబాలలో జరుపుకునే పుట్టినరోజు వేడుకలు,పెళ్లిరోజు వేడుకలు, సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని, ప్రతి ఒక్కరు కూడా ఇలాగే స్పందించి మీ మీ కుటుంబాలలో జరిగే వేడుకలలో భాగంగా అనాధ వృద్ధాశ్రమాలకు,చేయూతనివ్వాలనివారుకోరారు,ఈకార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News