Saturday, 18 April 2026 02:23:29 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

తెలంగాణలో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం

Date : 17 March 2026 03:59 PM Views : 35

DNB News - తెలంగాణ / : తెలంగాణలో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత… ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టు తుది తీర్పు మేరకు… నాంపల్లి కోర్టు లో లొంగిపోయారు. ఇన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి… ఇటీవలే భారత్‌కు వచ్చి కోర్టులో హాజరయ్యారు. 2002 ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘటనలో… కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగిన ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా, సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నారు. ప్రత్యూషది ఆత్మహత్య కాదని… హత్యేనంటూ ఆమె తల్లి సుదీర్ఘకాలం న్యాయపోరాటం సాగించారు. ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపణ కారణంగా ఆత్మహత్య జరిగిందన్న అభియోగాలపై… ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే అనంతరం హైకోర్టు శిక్షను రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా… సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. అదేవిధంగా… నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు… ఆ ఆదేశాల మేరకు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ఈ పరిణామంతో… చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో కీలక మలుపు ఏర్పడింది

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :