Tuesday, 28 April 2026 04:11:16 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మీకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ డిమాండ్

Date : 24 April 2026 05:43 PM Views : 44

DNB News - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మీకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో శుక్రవారం రోజు ఆర్టీసీ జేఏసి కార్మీకుల కు మద్దతు తెలుపారు. ఆర్టీసీ డిపో వద్ద కార్మీకులతో కలిసి ఆంధోళన పాల్గొని నిరసన తెలిపారు. కార్మీకులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బస్టాండ్ నుండి కార్మీకులతో కలిసి అమరవీరుల స్థూపం వరకు మేయర్ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ...సంతాపం ప్రకటించారు. ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ....ఆర్టీసిని ప్రభుత్వం లో విలీనం చేస్తూ... కార్మీకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసి కార్మీకుల బకాయి ఉన్న వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని చేయాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మీకులను పట్టించుకొక పోవడం వల్లే ఆత్మహత్యలు చేస్కోవల్సిన పరిస్తితి ఏర్పడిందని ద్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మీకులు చేస్తున్న న్యాయపోరాటానికి బీజేపి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రబుత్వ మొండి వైఖరి వల్లే నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందడం జరిగిందని... దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి డిమాండ్ల నెరవేర్చాలన్నారు. ఆర్టీసీ కార్మీకుల పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త బస్సులను కోనుగోలు చేయాలన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ అద్దెబస్సులను నడుపుతూ కార్మీకులకు తీరని అన్యాయం చేస్తుందని.. వెంటనే నడిపిస్తున్న అద్దె బస్సులను తగ్గించాలన్నారు. 30 శాతం ఫిట్ మెంట్ తగ్గకుండా 2021 వేతన సవరణలను వెంటనే చేపట్టి ఆర్టీసీ జేఏసి కార్మీకులు తీస్కున్న సమ్మెను విరమింప చేయాలన్నారు ఆర్టీసీ జేఏసి ప్రభుత్వం ముందు ఉంచిన 32 న్యాయమైన డిమాండ్ల పై కార్మీక సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిపి వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీసి సంస్థలో నూతన రిక్రూట్ మెంట్ చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మీకుల హక్కుల కోసం పోరాటం చేసే వారికి మద్దతు తెలిపి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీస్కోవాలన్నారు. గుర్తింపు పొందిన కార్మీక సంఘాల యూనియన్లను వెంటనే ప్రారంబించాలన్నారు. యూనియన్ల ద్వారానే వారి సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి... యూనియన్లతో ప్రభుత్వం చర్చలు జరిపి... వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడి సమ్మెలో ఉన్న 39 వేల మంది కార్మీకులతో తక్షణమే చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం సానుకూలంగా చర్చలు జరపకుండా... సమస్యలను పరిష్కరించ కుండా కార్మీకులను బెదింపులకు గురి చేయడం ముర్ఖత్వమని మండి పడ్డారు. ఇప్పటికైన చర్చలు జరిపి... వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని... సమ్మెను విరమింపజేసేలా చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు చంద్ర, దేవసాని సరస్వతి, మాసం గణేష్, తోట అనిల్ మరియు ఆర్టీసీ యూనియన్ నాయకులు, కార్మీకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :