DNB News - తెలంగాణ / : కరీంనగర్ జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాచకొండ నరేష్ తన పుట్టినరోజు వేడుకలను నగరంలోని రేకుర్తి విజయపురి కాలనీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని స్వాములందరికీ ‘బిక్ష’ (అన్నదానం) ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రాచకొండ నరేష్ మాట్లాడుతూ తాను ఎంతగానో కొలిచే ఆరాధ్య దైవం పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో, భక్తులు, స్వాముల మధ్య తన జన్మదినాన్ని జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతో జిల్లాలోని రజక సంఘం అభివృద్ధికి, ప్రజా సేవకు నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.సన్నిహితులు, భక్తులు, కుటుంబ సభ్యులు పాల్గొని నరేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ అన్నదానం నిర్వాహకులు దేవజు అనిల్ గంగిపల్లి నరేష్ , మాజీ కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ , హనుమాన్ స్వాములు ,గంగిపల్లి కనకయ్య,గోగులకొండ తిరుపతి, దేవజు ప్రభాకర్, శేఖర్,మహేష్, చింతల తాళం సతీష్, మహేందర్ 150 స్వాములు భక్తులు పాల్గొన్నారు.
Admin
DNB News