Wednesday, 22 April 2026 03:45:52 PM
# పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం.. # జొన్నగిరి సమీప గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి... # పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి # ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ # సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

శాతవాహనలో పరిశుభ్రతపై ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం- బోయినపల్లి హరిణి పరిశుభ్రత వల్లనే ఆరోగ్య జీవన శైలి - ఆచార్య ఉమేష్

Date : 22 April 2026 11:34 AM Views : 3

DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ లైబ్రరీ ఆడిటోరియం లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం ఆన్ హైజిన్" కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ విశిష్ట అతిథిగా విచ్చేసి వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాధుల నివారణ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించాలన్నారు. ప్రతిమా ఫౌండేషన్ ఫౌండర్ & డైరెక్టర్ డా. బోయినపల్లి హరిణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ చదువుతోపాటు ఆరోగ్యాన్ని కూడా క్రమశిక్షణగా ఉంచుకోవాలని, యువత తమ శరీరంలో ముందస్తుగా వచ్చే అనేక వ్యాధులపై అవగాహన కల్పించుకొని ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి ప్రయత్నం చేయాలని, మన తోటి వారికి అవగాహన కల్పించాలని తెలియజేస్తూ ప్రతిమ ఫౌండేషన్ తరపున వాడిన శానిటరీ పాడ్ల,వ్యర్దాలని నాశనం చేసే ఇన్సినిరేటర్ యంత్రాలను బహుకరించారు. గౌరవ అతిధిగా విచ్చేసిన డేర్మాటలోజిస్ట్ ఆచార్య గీతా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ యువత తమ ఆరోగ్యం పట్ల అవగాహనతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జంక్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని మానసిక ఆరోగ్యం కోసం శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవాలని మహిళలు తమ ఆరోగ్యం పట్ల శరీరంలో వచ్చే మార్పుల పట్ల జాగ్రత్తతో ఉండాలని మనం తినే ఆహార పదార్థాల వల్లనే శరీరంలో క్యాన్సర్ కారకాలు ఉత్పన్నమవుతున్నాయని, బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. డా. సత్య ప్రభ, గైనకాలజీ విభాగాధిపతి మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యువత జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి ఆరోగ్య అలవాట్లు జీవితాన్ని ఆనందమయం చేస్తాయని సూచించారు. కన్వీనర్ చీఫ్ వార్డెన్ డా. నజిముద్దీన్ మునవర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి దోహదపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డా.పద్మావతి, డా.నమ్రత, డా.జయంతి, సావిత్రి, అధ్యాపకులు, సైన్స్, ఆర్ట్స్, కామర్స్, న్యాయ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :