DNB News - తెలంగాణ / : తెలంగాణలో హాఫ్ డే స్కూళ్ల అమలుపై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం 2025–26 చివరి పని దినమైన ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ యాజమాన్యంలోని ప్రాథమిక, పై ప్రాథమిక మరియు హై స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించాలి. మధ్యాహ్న భోజనం 12:30 గంటలకు అందించబడుతుంది. మార్చి 2026లో జరగనున్న ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు పదో తరగతి విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని తెలిపారు. ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు పరీక్షల రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించబడతాయి. మిగిలిన రోజుల్లో మాత్రం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు హాఫ్ డే సమయాలు అమలులో ఉంటాయి. ఈ ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు తెలియజేసి కచ్చితంగా అమలు జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు డైరెక్టర్ ఆదేశించారు.
Admin
DNB News