Wednesday, 22 April 2026 03:40:47 PM
# పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం.. # జొన్నగిరి సమీప గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి... # పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి # ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ # సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

మిషన్ భగీరథ పథకంలో అవినీతి పై విచారణ చేయాలి..

Date : 22 April 2026 11:49 AM Views : 5

DNB News - తెలంగాణ / : గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంలో జరిగిన అవినీతి పై సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలల్ పవార్ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ‌సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు.మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు మాట్లాడారు.ఇంటింటికీ మంచినీటిని అందించేందుకు గత శాఖ ప్రభుత్వం అమలు చేసిన మిషన్‌ భగీరథ పథకంలోని అవినీతి, అక్రమాలపై విచారణకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలల్ పవార్ ఆదేశించాలని ఆయన కోరారు. ఈ పథకంలో సుమారు కోట్ల మేర అవినీతి జరిగిందని, మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ చేసిన పనులు, ఖర్చు చేసిన నిధుల పై విచారణ చేయాలని పేర్కొన్నారు.ఇంటింటికీ మంచినీటి అందించేందుకు మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయా పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆయన చెప్పారు. గ్రామాల వరకూ పైపు లైన్లను వేసినా.. గ్రామాల్లో మాత్రం పాత ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైపు లైన్లకే లింక్‌ చేసినట్లు తెలుస్తోంది. పలు గ్రామాలలో ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైపులైన్లను వేయకుండానే వేసినట్లు బిల్లులు కూడా తీసేసుకున్నారని తద్వారా కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సదరు అక్రమాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం,కలకోవ సర్పంచ్ మండవ వెంకటాద్రి, సిపిఎం మండల కమిటీ సభ్యులు దేశి రెడ్డి స్టాలిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :