DNB News - తెలంగాణ / : గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంలో జరిగిన అవినీతి పై సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలల్ పవార్ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు.మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు మాట్లాడారు.ఇంటింటికీ మంచినీటిని అందించేందుకు గత శాఖ ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథ పథకంలోని అవినీతి, అక్రమాలపై విచారణకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలల్ పవార్ ఆదేశించాలని ఆయన కోరారు. ఈ పథకంలో సుమారు కోట్ల మేర అవినీతి జరిగిందని, మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ చేసిన పనులు, ఖర్చు చేసిన నిధుల పై విచారణ చేయాలని పేర్కొన్నారు.ఇంటింటికీ మంచినీటి అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయా పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆయన చెప్పారు. గ్రామాల వరకూ పైపు లైన్లను వేసినా.. గ్రామాల్లో మాత్రం పాత ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపు లైన్లకే లింక్ చేసినట్లు తెలుస్తోంది. పలు గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్లను వేయకుండానే వేసినట్లు బిల్లులు కూడా తీసేసుకున్నారని తద్వారా కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సదరు అక్రమాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం,కలకోవ సర్పంచ్ మండవ వెంకటాద్రి, సిపిఎం మండల కమిటీ సభ్యులు దేశి రెడ్డి స్టాలిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News