DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా లో మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులను తెలంగాణ రాష్ట్ర పీ సీ సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఖమ్మం జిల్లా డీ సీ సీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన అన్ని మండలాల కి మండల కాంగ్రెస్ అధ్యక్షులని నియమించటం జరిగింది. దానిలోభాగంగా తిరుమలయపాలెమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి గా కొప్పుల అశోక్ ని నియమించటం జరిగింది . ఈ సందర్బంగా కొప్పుల అశోక్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు అధ్యక్ష పదవిని అప్పజెప్పినందుకు రాష్ట్ర,, జిల్లా , మండల నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నాపై ఈ బాధ్యత ఉంచినందుకు మండల ప్రజలకి , నాయకులకి , అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాలేరు నియోజకవర్గ మంత్రి శ్రీ పొంగులేటి. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కొరకు ప్రజల కష్ట సుఖాలాల్లో పాలు పంచుకోంటానని మండల ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు.
Admin
DNB News