DNB News - తెలంగాణ / : మునగాల గ్రామపంచాయతీ ఎంప్లాయి అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మునగాల ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించి అనంతరం ఎంపీ ఓ నరేష్ వినతి పత్రం అందచేయడం జరిగినది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అంటూ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా అటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఏళ్ల తరబడి పనిచేసిన పనికి భద్రత, పర్మినెంట్,కనీస వేతనాలు, పిఎఫ్,ఈఎస్ఐ, ప్రమాద భీమ లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. జీవో నెంబర్ 51 సవరణ, మల్టీపర్ వర్కర్స్ విధానం రద్దు చేయాలి. కారోబర్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కలిపించాలి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టో వర్తించి న విధంగా పంచాయతీ సిబ్బంది అందరూ చేసి కనీస వేతన అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులను ఎల్ నాగార్జున, డి రవి, డి గురువమ్మ, రేణుక, ఎం వెంకన్న, ఉదయమా, బి సైదులు టి చంద్రశేఖర్ ఎం ముత్తయ్య జి ప్రసాద్, డి వసరాం, ఆర్ గోపయ్య,పి వీరబాబు, యస్ రఘు, బి పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News