Monday, 15 June 2026 02:18:20 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

తేల్చేస్తారా..! స్పీకర్ ప్రకటనపై రాజకీయ ఉత్కంఠ

Date : 11 March 2026 10:38 AM Views : 53

DNB News - తెలంగాణ / : పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై స్పీకర్ తీసుకోనున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం విచారణ పూర్తవడంతో ఈరోజు ఉదయం 10 గంటలకు స్పీకర్ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి, అలాగే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ టికెట్‌పై వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేల విషయంలో స్పష్టమైన ఆధారాలు లేవని, వారు ఇప్పటికీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారని స్పీకర్ విచారణ అనంతరం ప్రకటించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని ఎన్నికల సంఘం వద్ద ఆధారాలు నిర్ధారించాయి. అలాగే కడియం శ్రీహరి తన కుమార్తె తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్‌కు ఆధారాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈరోజు స్పీకర్ తీసుకునే నిర్ణయం ఇద్దరు ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యాన్ని తేల్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో స్పీకర్ ప్రకటనపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :